
జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న ఆదేశానుసారం మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని గంజిపేట 14వార్డు లో ప్రజలతో సమావేశం నిర్వహించిన బి ఆర్ యస్ పార్టీ 14 వార్డు నాయకులు పి డి యస్ యూ గంజిపేట రాజు పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని,రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని పి డి యస్ యూ గంజిపేట రాజు అన్నారు.కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుద్ధ్యం నుంచి ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
