
బాయికాడి జగదీష్ మృతి పట్ల హన్మంత్ షిండే గారి నివాళి
బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన బాయికాడి జగదీష్ (పుస్తకాల కవి, రచయిత) గురువారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జగదీష్ గారి మరణవార్త తెలుసుకున్న వెంటనే జుక్కల్ మాజీ శాసన సభ్యులు శ్రీ హన్మంత్ షిండే బిచ్కుందలోని జగదీష్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పుష్పహారాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హన్మంత్ షిండే గారు మాట్లాడుతూ, “చిన్న వయసులోనే ఒక మంచి కవి, రచయితను కోల్పోవడం చాలా బాధాకరం. తన రచనల ద్వారా సమాజానికి మంచి సందేశాలు అందించిన జగదీష్ గారి లోటు ఎప్పటికీ తీరదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన హన్మంత్ షిండే గారు, ఈ దుర్ఘటనను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. జగదీష్ గారి మృతి సాహిత్య రంగానికి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.జగదీష్ గారి అకాల మరణంతో బిచ్కుంద పట్టణం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ కార్యక్రమం లో BRS పార్టీ పట్టణ అధ్యక్షులు అవర్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, మాజీ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలన్న, అరవింద్, మాజీ వార్డ్ మెంబర్ సాయిని శంకర్, BRS యువ నాయకుడు చేతన్, పస్కె సంజయ్ తదితరులు పాల్గొని నివాళ్లు హరిపించారు.
