
జనం న్యూస్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి,/ షాదీ మూరక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో నే సాధ్యమవుతుంది…త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో అభివృద్ధి కొరకు పాటు పడి నాయకులను ఆశీర్వదించాలి ప్రజల సంక్షేమమే నా లక్ష్యం…ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల టౌన్ సంబంధించిన వివిధ వార్డ్ చెందిన ఆడపడుచులకు కళ్యాణి లక్ష్మి/ షాదీమూరక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ చేతులమీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగినది.145 మంది ఆడపడుచులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు 1లక్ష 116 రూపాయలు చెక్కులను అందజేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి పథకం పెళ్లిళ్లకు కానుకగా 1లక్ష 116 రూపాయలను అందించడం జరుగుతుంది.కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు . నేను ఎమ్మెల్యేగా గెలిచి నప్పటి నుండి గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది గతంలో గ్రామాలలో గత నాయకులు సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు కానీ నేను గెలిచి నప్పటి నుండి ప్రతి గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది గద్వాల నియోజకవర్గం వైద్యరంగం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కృషి చేయడం జరిగింది ఈ ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలతో గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ ,నర్సింగ్ కాలేజ్, 300 పడకల హాస్పిటల్, సి.సి రోడ్లు డ్రైనేజీ, ప్రధాన రహదారులు రోడ్డు నిర్మాణంలో, జూనియర్ కాలేజీ, గురుకుల పాఠశాలలు అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది.అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని నెట్టెంపాడు ర్యాలంపాడు రిజర్వాయర్ నీటి సామర్థ్యం పెంచే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి తో త్వరగా పనులను ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలుగు టీఎంసీల నీళ్లు నిలువ ఉంచే విధంగా ప్రభుత్వము కృషి చేయడం జరుగుతుంది. వాటి ద్వారా గట్టి ఎత్తిపోతల పథకము కూడా త్వరగా నిర్మాణము చేసుకొని రైతులకు రెండు పంటలకు నా వంతు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి మొదటి విడతలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఉచిత ప్రయాణం 500 గ్యాస్ రేషన్ కార్డులను సన్నబియ్యము ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు ముఖ్యమంత్రి ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు చీరలను పంపిణీ చేయడం జరిగింది.తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీల చెప్పిన ప్రకారం ఒక దానికో తర్వాత ఒకటి నెరవేరుతుందని తెలిపారు. మీరందరి ఆశీర్వాదంతో నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేలు చేయాలని అభివృద్ధిని కొనసాగించాలని. సంక్షేమ పథకాలు మీ అందరికీ అందించాలని అధికార పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. అధికార పార్టీలో భాగస్వామ్యం సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభివృద్ధికార పార్టీకి మద్దతు తెలిపి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలలో ప్రతి ఒక్కరు మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి వార్డ్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.భవిష్యత్తులో గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చేసుకొని గద్వాల రూపురేఖలు మార్చే విధంగా రాష్ట్రంలోని గద్వాల పట్టణం నెంబర్ వన్ స్థానంలో నిలిచే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు