
జనంన్యూస్. 23.నిజామాబాద్ రురల్..శ్రీనివాస్ పటేల్..
నిజామాబాద్ కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి , రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి , ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజి మల్టీజోన్ వన్ చంద్రశేఖర్ , నిజామాబాదు సిపి సాయి చైతన్య .పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ
ప్రజలకు చేరువగా పోలీసింగ్ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
