జనం న్యూస్ //ఫిబ్రవరి //7//జమ్మికుంట //కుమార్ యాదవ్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధిక పీసులు వసూలు చేస్తున్నారని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ మెరకి విద్యార్థి సంఘాలు స్కూల్ యొక్క యజమాన్యాన్ని అడగగా వారితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు ఇష్టానుసారంగా మాట్లాడుతూ విద్యార్థి సంఘాలపై కేసు పెట్టానని పోలీసులతో విద్యార్థి సంఘాలను బెదిరిస్తూ రాజకీయ వ్యవస్థను స్కూల్ పై తీసుకొచ్చి స్కూల్ యొక్క వ్యవస్థా బ్రస్ట్ పట్టిస్తున్నారని విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కష్టార్జితం దోపిడీ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాలు లోటస్పాండ్ స్కూల్ ముందు నిరసనకు దిగి ఆందోళన చేపట్టారు. లోటస్పాండ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద స్కూల్ యొక్క ఫీజు హాస్టల్ యొక్క ఫీజుకి 35 వేలకి మాట్లాడుకోగా, విద్యార్థి యొక్క తల్లిదండ్రుల వద్ద 46 వేల రూపాయలు వసూలు చేయడం పట్ల నిరసిస్తూ ధర్నా చేపట్టారు. దీనిపై లోటస్పాండ్ ఒక యజమాన్యంకి పోలీసులకు 100 డయల్ చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థి సంఘాలని అదుపులోకి తీసుకున్నారు. తదనానంతరం యాజమాన్యాన్ని పోలీస్ స్టేషన్కు పిలిపించగా యజమాన్యం విద్యార్థి సంఘాలకు క్షమాపణ కోరారు.విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… ఇలా అధిక ఫీజులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని మళ్లీ పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏదైతే విద్యార్థి తల్లిదండ్రుల వద్ద అధిక ఫీజు తీసుకున్నారు 10000 రూపాయలు విద్యార్థి యొక్క తండ్రికి అప్పజెప్పడం జరిగిందన్నారు.విద్యార్థి సంఘాల పోరాటం విద్యార్థుల తల్లిదండ్రులకు దక్కుతుందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.