
అంగన్వాడి టీచర్ రాధ,స్వరూప ,
జనం న్యూస్,జనవరి 24,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని చాప్ట బి గ్రామంలో శనివారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ తనయుడు శ్యామ్ నాయక్,చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలని అన్నారు. చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించడంతో విద్యతోపాటు,శారీరక మానసిక,దృఢత్వం, పెరుగుతుందని అన్నారు.గర్భిణీలు, బాలింతలు,అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టిక ఆహారాన్ని స్వీకరించాలని అన్నారు.అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు,