
జుక్కల్ జనవరి 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 1వ తేదీ నుండి 20వ తేదీ ఫిబ్రవరి 2026 వరకు నిర్వహించనున్న తాగునీటి సరఫరా ప్రత్యేక డ్రైవ్పై మండల స్థాయి సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో ఎంపీడీఓ, ఏఈ నయీమ్ (ఆర్డబ్ల్యూఎస్), ఏఈ గ్రిడ్ అఫ్నాన్, ఏఈ హౌసింగ్, ఏఈ పీఆర్, అన్ని గ్రామాల సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వేసవి కాలానికి తాగునీటి సరఫరా సిద్ధతలపై అన్ని హాబిటేషన్లలో నీటి ట్యాంకుల మరమ్మత్తులు, పైప్లైన్ మరమ్మత్తులు, బోర్వెల్ మరమ్మత్తులు, అవసరమైతే బోర్వెల్లను అద్దెకు తీసుకోవడం మరియు అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల సిద్ధతపై విపులంగా చర్చ జరిగింది.

