
జనం న్యూస్ - జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ -
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శనివారం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి. రాజగోపాల్ రెడ్డి తన మిత్రులతో కలసి సందర్శించారు. విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి నిడుమనూరు కోర్ట్ సూపర్డెంట్ శర్మ, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరు బుద్ధవనం చేరుకొని బుద్ధ చరిత వనములోని బుద్ధుని పాదాల వద్ద వందనం సమర్పించిన తర్వాత బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్తూ పవనాలను వీక్షించారు. మహాస్తూపం సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని తిలకించిన అనంతరం ధ్యాన మందిరంలో బుద్ధజ్యోతులను వెలిగించారు. వీరికి బుద్దవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్దవనం బ్రోచర్లను అందజేసి బుద్ధవనం కండువాళతో సత్కరించారు. అనంతరం వీరు టూరిజం లాంచీలో నాగార్జున కొండను చేరుకొని నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యాం వివరాలను, నాగార్జునకొండ మ్యూజియం, బుద్ధవనం చారిత్రక విశేషాలను తెలియజేశారు. వీరితోపాటు కోర్టు సిబ్బంది ఖాలిక్,నిరంజన్,శివ తదితరులు ఉన్నారు.