
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955
పల్నాడు జిల్లా: నరసరావు పేట.నేడు ఉదయం 11.00 గం.లకు స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ,ఎస్టీల కోసం మరియు దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు.గత నెల నుంచి ప్రతి నెలా నాలుగో శనివారం ఎస్సీ,ఎస్టీలతో పాటూ దివ్యాంగులకు సైతం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీ,ఎస్టీలు, దివ్యాంగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.