
జనం న్యూస్ జనవరి(26) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గ సోమవారం నాడు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ జండా ఆవిష్కరణ చేసినాడు. నూతనకల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ జెండా ఆవిష్కరణ చేసినాడు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సర్పంచులు,వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
