
జనం న్యూస్ 30 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రతిపాదిత ఐటీ పార్క్, డేటా సెంటర్ల కోసం సాగు భూముల సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు పోరుబాట పట్టారు. శుక్రవారం నాడు విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి రైతులు వినతిపత్రం అందజేశారు.రైతుల ప్రధాన అభ్యంతరాలు:జీవనాధారం ప్రమాదంలో: వందల ఏళ్లుగా వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఏడాదికి మూడు నాలుగు పంటలు పండే సారవంతమైన భూములను వదులుకోలేమని రైతులు స్పష్టం చేశారు. వరి, చెరుకు, వేరుశనగ, కొబ్బరి పండిస్తూ దేశవ్యాప్త ఎగుమతులతో జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.గత త్యాగాలను గుర్తు చేస్తూ: భోగాపురం విమానాశ్రయం కోసం ఇప్పటికే 3 వేల ఎకరాల భూమిని ఇచ్చామని, ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.పరిహారం కంటే భూమే ముఖ్యం: ఎన్ని కోట్ల ప్యాకేజీ ఇచ్చినా తమకు వద్దని, తమకు వ్యవసాయం తప్ప మరే పని రాదని తేల్చి చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదన్నారు.ఉపాధి హామీపై నమ్మకం లేదు: గతంలో భూములు సేకరించిన చోట ఇప్పటికీ నిర్మాణాలు జరగలేదని, స్థానికులకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదని రైతులు విమర్శించారు."మా ప్రాణాలు తీసి అయినా భూసేకరణ చేసుకోండి.. కానీ భూములను మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు." - ముంజేరు గ్రామ రైతులు నిరసనలో పాల్గొన్న ముఖ్యులు:ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సర్పంచ్ పూడి నూకరాజు, పిడుగు సత్యనారాయణ, పిడుగు వెంకట సత్యం, ఎంపీటీసీ వెంకట సత్యం, పిడుగు తోట రావు, జక్కంపూడి రాంబాబు, పిడుగు తౌడు సహా గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐటీ పార్క్ ప్రతిపాదనను విరమించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.