
.జనం న్యూస్:ఫిబ్రవరి 3 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
నరసరావు పేట జిల్లారావిపాడు గ్రామానికి చెందిన మేడా రాములమ్మ అనే వృద్ధురాలికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా 2.5 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేశారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఇంటి స్థలం పట్టాను వృద్ధురాలికి అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ లు పాల్గొన్నారు.