
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4
మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మంగళవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు.వేద మంత్రోచ్ఛారణల నడుమ.. మాఘమాసం బహుళ విదియ, మఖ నక్షత్రం మిగులు కాలం నందు.. ఆలయ ఈ.ఓ. ఈదుల చెన్నకేశవరెడ్డి, ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో ఈ క్రతువు శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితులు, స్థానాచార్యులు నల్లాన్ చక్రవర్తుల రామ గోపాలాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి రమణాచార్యులు, ఆగమాచార్యులు లక్ష్మణ తిలక్ స్వామిల వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. స్వామి వారిని కూనపులి రమణయ్య శర్మ ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేశారు.ఉభయ దాతలు మరియు ముత్యాల తలంబ్రాలు ఈ కల్యాణ మహోత్సవానికి జవ్వాజి విజయ భాస్కర రావు దంపతులు (శేషు కుమారి), జవ్వాజి సాయి కృష్ణ దంపతులు (హేమసాయి) ఉభయ దాతలుగా వ్యవహరించారు. దేవేరుల కల్యాణానికి సిద్దం శివకుమార్ దంపతులు (నిర్మల) మరియు కీ.శే. గోపు వెంకటయ్య ధర్మపత్ని శ్రీదేవి ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతోసమర్పించారు.భక్త జన సందోహంచుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోవిందా నామస్మరణతో తర్లుపాడు మార్మోగింది. ఈ సందర్భంగా ప్రవచకులు తాల్లూరి దుర్గారావు భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనం వినిపించారు. భక్తులందరూ కల్యాణాన్ని తిలకించి తరించారు. ఈ వేడుకలో కనిగిరి డిఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్, తర్లుపాడు ఎస్ఐ బ్రాహ్మనాయుడు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వి ఆర్ ఓ కంచర్ల శివాకాసి దంపతులు స్వామి వారికీ కల్యాణ మహోత్సవంలో పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ వెన్నా ఇందిరా, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్,శివాలయం ధర్మకర్త నేరెళ్ల కార్తీక్,గ్రామపెద్దలు సూరెడ్డి సుబ్బారెడ్డి, ఈర్ల వెంకటయ్య,కాళంగి పెద్ద శ్రీనివాసులు,కొలగట్ల భాస్కర్ రెడ్డి,గోసు వెంకటేశ్వర్లు, జవ్వాజివెంకటేశ్వర్లు,కుందురు చిన్న కాశీ రెడ్డి, గోసు ఆదినారాయణ, తిప్పిరెడ్డి వెలుగొండరెడ్డి,కొలగట్ల గంగాధర్, దోగిపర్తి మల్లికార్జున, భవనం రామకృష్ణ రెడ్డి చినమనగొండ సుబ్రహ్మణ్యం భక్తులు తదితరులు పాల్గొన్నారు.