
జనం న్యూస్ ఫిబ్రవరి 4 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి. రెండు బస్సులు ఢీకొని ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం. వరంగల్ నుండి సిరిసిల్లకు వెళ్తూ న్న ఆర్టీసీ బస్సు, హనుమకొండ నుండి దామర గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్టాండ్లు కూడలి వద్ద ఢీకొన్నాయి. డ్రైవర్లు ఇద్దరు తప్పు నీదంటే నీదని వాగ్వాదం చేసుకున్నారు. సుమారు అరగంట పాటు రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు దిగి ఇద్దరు డ్రైవర్లను చివాట్లు పెట్టడంతో, రాజీపడి ఎవరిన దారిన వారు వెళ్ళిపోయారు. అసలు బస్టాండ్ కూడలీ ఏర్పడినప్పటి నుండి సరియైన నేమ్ బోర్డులు లేక ఈ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగు కోట్ల రూపాయలతో బస్టాండ్ కూడలిని నిర్మించినప్పటికీ, కాంట్రాక్టర్ నేమ్ బోర్డులు పెట్టడంలో జాప్యం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయడంలో సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానివల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
