
జనం న్యూస్ ఫిబ్రవరి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి వివేకానంద నగర్లోని బ్రహ్మకుమారీస్ సుఖ్ శాంతి భవన్లో 90'వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివ జయంతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యత, నైతిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి, సద్భావన కోసం బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం అని రాజేశ్వరరావు అన్నారు. అనంతరం ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
