
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 5 సెల్ 9550978955
7, 8 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలువురు శాసనసభ్యులు.
రెండురోజులు పర్యాటకులకు గొప్ప అనుభూతినిచ్చే వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు.
జిల్లా కలెక్టర్, ఇతర ప్రధానాధికారులు, కూటమి నాయకులతో కలిసి కొండవీడు ఫెస్ట్ : 2026 2కె రన్ లో పాల్గొన్న మాజీమంత్రి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరిలో కొండవీడు ఉత్సవాలు నిర్వహించామని, మరలా ఇన్నేళ్ల తర్వాత అప్పటికంటే ఘనంగా భావితరాలకు కొండవీడు చారిత్రక గొప్పతనం తెలిసేలా 7, 8 తేదీల్లో ఉత్సవాలకు శ్రీకారం చుట్టామని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం కొండవీడు ఫెస్ట్ -2026 ప్రచార కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించిన 2కె రన్ లో ప్రత్తిపాటి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, డీ.ఎఫ్.ఓ, ఇతర ప్రధానాధికారులు, కూటమినాయకులతో కలిసి రన్ లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.రెడ్డిరాజుల ఘనచరిత్రకు ప్రతీక అయిన కొండవీడు కోట గొప్పతనం భావితరాలకు తెలియచేయాలన్న ఆలోచనతోపాటు, కోటను ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయంలో భాగంగా భారీ ఎత్తున కొండవీడు ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ప్రత్తిపాటి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ చూడని, అనుభూతి చెందని ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సవాల్లో ఏర్పాటు చేశామన్నారు. కొండ పైన, దిగువన పర్యాటకుల ఆనందమే లక్ష్యంగా వివిధ వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ప్రత్తిపాటి చెప్పారు.ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రి పెమ్మసాని, దేవాదాయమంత్రి ఆనం మరుసటి రోజు మంత్రులు సత్యప్రసాద్, బీసీ జనార్థర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుల రాక
కొండవీడు ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారని ప్రత్తిపాటి చెప్పారు. వారితో పాటు ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని ప్రత్తిపాటి తెలిపారు. 7వ తేదీ సాయంత్రం చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పలువురు శాసనసభ్యులు వేడుకల్లో సందడి చేస్తారన్నారు.
8వ తేదీ ఉదయం రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేశ్, రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విచ్చేస్తారని, సాయంత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావులు ప్రత్యేక అతిథులుగా విచ్చేయనున్నట్టు ప్రత్తిపాటి పేర్కొన్నారు. వీరే కాకుండా మరికొందరు ప్రజాప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొని సందడి చేస్తారని ఆయన చెప్పారు.
డైనమిక్ కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో, కొండవీడు ఉత్సవాలతో పాటు కోటప్పకొండ తిరునాళ్ల కార్యక్రమాలు ప్రజలు మెచ్చేలా ఈ ఏడాది భారీస్థాయిలో జరగనుందని ప్రత్తిపాటి తెలిపారు. 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.పర్యాటకుల ఆనందానికి లోటు లేకుండా కార్యక్రమాలు : జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీఆర్డీఏ పరిధిలో మంచి పర్యాటక ప్రాంతంగా కొండవీడు కోట నిలవనుందని, 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఉత్సవాల విశిష్టతను తెలియచేసేలా నేడు పట్టణంలో భారీస్థాయిలో 2కె రన్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా తెలిపారు.హెలికాఫ్టర్ రైడ్, బోటింగ్, హర్స్ రైడింగ్, కయాకి, ఫ్లవర్ షో, కల్చరల్ షోలు ఏర్పాటు చేశామని, పర్యాటకుల ఆనందానికి లోటులేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.2కె రన్ లో ప్రారంభించిన ప్రత్తిపాటి, కలెక్టర్ బుల్లెట్ లపై కూర్చొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు. రన్ ప్రారంభానికి ముందే కొండవీడు ఫెస్ట్ -2026 ప్రచార స్టిక్కర్స్, గోడ ప్రతుల్ని ప్రత్తిపాటి, కలెక్టర్, వివిధ విభాగాల అధికారులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో డిఎఫ్వో కృష్ణప్రియ, ఆర్డీవో మధులత, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, రాష్ట్ర సాంసృతిక విభాగ నాయకులు కందిమల్ల సాంబశివరావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, టీడీపీ నాయకులు,ఇనగంటి జగదీష్, అమరా రమాదేవి, బేరింగ్ మౌలాలి, మద్దిబోయిన శివ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు నెల్లూరి రంజిత్, ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకరరావు, డిఇ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.