
జనం న్యూస్ ఫిబ్రవరి 5, వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 13వ వార్డు బీసీ కాలనీ మందులా కాలనీలలో అభ్యర్థి అనూష బాబ్జిని గెలిపించాలని ఓటర్లను కోరుతూ గుల్బర్గా జిల్లా ఉపాధ్యక్షురాలు సెడం మాజీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పాటిల్ సతీమణి సంతోషా రాణి ఇంటింటి ప్రచారం నిర్వహించి, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలు బిజెపి నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని, ఓటర్ల కు వివరించారు. నరేంద్ర మోడీ గారు ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం, కరోనా కష్టాకాలంలో అందించిన కోవిద్ టీకాలు మహిళలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలు వివిధ కేంద్ర పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, కాలనీవాసులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.