
జనం న్యూస్ 9 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి గుండెపల్లి రామకృష్ణారెడ్డి తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.