
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
నందలూరు మండలంలోని నందలూరు గ్రామపంచాయతీ నీలి పల్లె గ్రామంలో గుర్రప్ప స్వామి తిరుణాలలో భాగంగా సోమవారం దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలు అలరించాయి. ఈ కార్య క్రమానికి మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బ రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారం భించారు. మొత్తం 06 జతలు ఈ పోటీలలో పాల్గొన్నాయి. మొదటి బహుమతి 50వేల రూపాయలను, ఓబులంపల్లి గ్రామానికి చెందిన సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డివృషభలు, రెండవ బహుమతి 40 వేల రూపాయలను బాలయ్య పల్లె గ్రామానికి చెందిన లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దులు, మూడవ బహుమతి 30 వేల రూపాయలను రంగూరి పల్లె గ్రామానికి చెందిన భక్తిల మహేందర్ ఎద్దులు,నాలుగవ బహుమతి 20వేల రూపా యలను సరస్వతి పేటకు చెందిన రామ్ చరణ్, బొగ్గుల లక్ష్మీదేవి ఎద్దులు, ఐదవ బహుమతి 10 వేల రూపాయలను గిద్దలూరు గ్రామానికి చెందిన సిరిగి రెడ్డి రామ్మోహన్ ఎద్దులు, ఆరవ బహుమతి 5 వేల రూపాయలను సిరిసిల్ల మండలం ఆర్ఎస్ కొండాపురం కు చెందిన యాపామాండ్ల శ్రీ ప్రణయ ఎద్దులు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,టిడిపినాయకులు పల్లె సుబ్రహ్మణ్యం, మోడ పోతుల రాము, నీటి సంఘం అధ్యక్షులు భూశెట్టి వెంకటసుబ్బయ్య, నిర్వా హకులు ఉప్పు శెట్టి రెడ్డయ్య, ఉప్పు శెట్టి సుధీర్, దాసరి పాపయ్య, దాసరి కాటయ్య, గంగయ్య, ఉప్పు శెట్టి పవన్, నరసయ్య, నరసింహ, ఉప్పు శెట్టి లడ్డు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
