
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి
జహీరాబాద్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిజమోద్దీన్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు లో దాదాపు 8 సంవత్సరాల నుండి ప్రజల మధ్య ఉంటూ ఎల్లప్పుడూ ప్రజల కోసం శ్రమిస్తూ కృషి చేసినందుకు లాక్ డౌన్ సమయంలో సొంత ఫ్లాట్లు అమ్ముకొని వార్డు ప్రజల కోసం నీళ్లు తాపాడు కాబట్టి ప్రజలు నిజాముద్దీన్ కు భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు లోకల్ నాయకుడు కావాలని ప్రజలు నిజాముద్దీన్ కు కౌన్సిలర్ గా ఎన్నుకున్నారు .