
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026
కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి బి ఆర్ ఎస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తమకు అసలైన బలం అని పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టం చేశారు. మునిసిపల్ కౌన్సిలర్లు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పారదర్శక పాలన అందిస్తామని, ప్రతి వార్డులో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ విజయం పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొంటూ, రానున్న రోజుల్లో జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే మాణిక్ రావు తెలిపారు.