
జనం న్యూస్,ఫిబ్రవరి 18,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బాన్సువాడ గ్రామానికి చెందిన జబ్బ రాములు,పెంటయ్య, తాను పెంచుకుంటున్న పశువుల కొరకై పశుగ్రాసాన్ని వరి గడ్డిని మిషన్ ద్వారా కట్టలు కట్టించి 500 మోపుల గడ్డిని నిలువ చేసుకోగా సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్టు జబ్బ రాములు తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్థానికులు వెంటనే మంటలను ఆర్పడానికై ఫైర్ ఇంజన్ తో మంటలు చెల్లార్పిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఆవులు గేదెలు,30 మూగజీవులకు గాను నిల్వ ఉంచిన పశుగ్రాసం కాలి బూడిదైందని అన్నారు. పశువులను కాపాడుకునేందుకై ప్రభుత్వం పశుగ్రాసాన్ని సమకూర్చవలసిందిగా ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.