
జనం న్యూస్, ఫిబ్రవరి 19,అచ్యుతాపురం:
మండలం లోని పూడిమడక సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మత్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోటు ఇంజన్ల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు మరియు ఆధునిక సాంకేతికతపై సిఐఎఫ్ నెట్ కు చెందిన టెక్నికల్ అధికారులు టి.హరనాథ్,అర్జున్,ప్రసాద్ మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.పీఎం ఎమ్ఎమ్ఎస్ వై పథకం, ఎన్.ఎఫ్డిబి నిధులు కోసం మత్స్యకారులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎఫ్ఓ జి.విజయ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ రవితేజ,మత్స్యకారులు పాల్గొన్నారు.
