
జనం న్యూస్ ఫిబ్రవరి 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆరె సంక్షేమ సంఘం అధ్యక్షులు గుజ్జుల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఎడ్ల స్వరూప సుధాకర్ రావు హాజరై మాట్లాడారు.. చత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే గుణం కలిగిన వ్యక్తిగా తన సామ్రాజ్యంలో అన్ని మతాలను గౌరవించేవాడని, మహిళలను గౌరవించేవాడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగలగాని లక్ష్మణరావు, ఎడ్ల బాపూరావు, వజీర్ శంకర్రావు, నిరంజన్ మోత్తయ్య మల్లయ్య మహేందర్ శ్రీనివాస్ గోపాల్ రాజు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….