
పది కోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్దాం మండల విద్యాధికారి విట్టల్
జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపిచేడ్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైజాబాద్ ,చండూర్ ,ప్రాథమిక పాఠశాల సోమక్కపేట్ పాఠశాలలను మండల విద్యాధికారి మరియు స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు సంయుక్తంగా సందర్శించారు.పదవ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో 100% సాధించాలి .అదేవిధంగా ఎక్కువమంది అదేవిధంగా ఎక్కువ అదేవిధంగా ఎక్కువమంది విద్యార్థులు 10 జిపిఏ సాధించాలని దీని కనుగొనంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పాఠశాలలో జరుగుతున్న బోధన-అభ్యసన కార్యక్రమాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, తరగతి గదుల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభ, నోట్ బుక్స్, రికార్డులు మరియు మౌలిక వసతులను పరిశీలించి ఉపాధ్యాయులకు పాఠశాలఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని శ్రౌచాలాయాలు పరిశుభ్రంగా రోజు కడగాలని ,తాగునీటి కుళాయిల దగ్గర శుభ్రంగా ఉంచాలని ,మధ్యాహ్న భోజనం వండేవారు శుభ్రంగా మరియు జాగ్రత్త వండా శుభ్రంగా మరియు జాగ్రత్త వండాలని ఎఫ్ ఎల్ ఎన్ ఎఫ్ ఎ ఎన్ ఎస్ బోధన సామర్ధ్యాలు మెరుగుపరచాలని పలు సూచనలు చేశారు.
విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా స్థాయిని తెలుసుకున్నారు. పాఠశాలలో శుభ్రత, తాగునీటి సదుపాయం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ఉపాధ్యాయులు నూతన బోధన విధానాలను అనుసరించి విద్యార్థుల అభివృద్ధికి కృషిౠ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల్గొన్నారు