
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండల కేంద్రం లో ఈరోజు 33 కెవి అండ్ 11 కెవి సబ్ స్టేషన్ లో వై నారాయణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల చైర్మన్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారముల వేదిక కార్యక్రమంలో భాగంగా సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ వారికి సిరికొండలో ప్రమాదకరంగా ఇండ్ల మధ్యలో ఉన్న 33 కెవి లైను ఊరి బయటకు మార్చుటకు మరియు లో వోల్టేజ్ సమస్య ఏ బి కేబుల్ తీసి థర్డ్ వైరు వేసి లో వోల్టేజ్ సమస్యలకు పరిష్కారం చూపాలని లూస్ లైన్లు ఉన్నచోట లైన్లు సరిచేసి అవసరమున్న చోట మరియు ఐరన్ పోల్లు ఉన్నచోట కొత్త సిమెంట్ పొల్లు వేయవలసిందిగా చైర్మన్ గారిని కోరడం జరిగింది ఇందుకు సానుకూలంగా స్పందిస్తూ 33 కెవి లైన్ గురించి సర్వే చేసి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని తెలపడం జరిగింది . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనగందుల మురళి,చిట్యాల రంజిత్, ఇందూరి అమృత, తదితరులు పాల్గొన్నారు