
జనం న్యూస్ ఫిబ్రవరి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 250 గజాలు ఇంటి స్థలం గౌరవ పెన్షన్ ఇతర హామీలను నెరవేర్చే దిశ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కృషి చేస్తున్నారని వారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి శాయంపేట మండల కేంద్రంలోని హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ పల్లె బోయిన సారయ్య బాసాని విద్యాసాగర్ గిద్ద మరి రామన్న యూత్ జిల్లా అధ్యక్షులు కొమ్ముల శివ మండల యూత్ అధ్యక్షులు ముంజల నాగరాజు మండల ఉపాధ్యక్షులు ఎండి రఫీ కోశాధికారి కానుగుల నాగరాజు టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్ నమిత భాజ్ అశోక్ రాజ్ మహమ్మద్ తుమ్మ ప్రభాకర్ అరికెళ్ల వీరయ్య మైలారం గ్రామ ఉద్యమకారూల అధ్యక్షుడు దూదిపాల జోగి రెడ్డి జూపాక సారయ్య తదితరులు పాల్గొన్నారు…