
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్).తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర నిన్న నిజామాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీతో, కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్న మంత్రిf పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను తెలంగాణ ఉద్యమకారులు స్వాగతిస్తున్నామని ఉద్యమకారుల ఫోరం నాయకులు నిమ్మల మనోహర్ మీడియాతో అన్నారు , గత 12 సంవత్సరంలో నుండి రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి టిఆర్ఎస్ ప్రభుత్వం,ఉద్యమకారులకు ఒరిగిందేమీ లేదని , రెండున్నర సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చినటువంటి ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని జార్ఖండ్ రాష్ట్ర తరహాలో ప్రతి ఉద్యమకారుడికి 25 వేల రూపాయల పెన్షన్స్ సౌకర్యం, కల్పిస్తానని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింద నీ అన్నారు అందుకుగాను నిన్నటి వరకి దాదాపు 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి అందులో భాగంగా నిన్నటి రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ,ఇదే రోజున తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిపైన ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వాలని గవర్నమెంట్, తెలంగాణ ఉద్యమకారులకు మంత్రులు పున్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమకారులకు తీపి కబురు చెప్పడం జరిగింది, అందులో భాగంగా గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మంది వివిధ రకాలుగా ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఆ 1200 మంది బలిదానాల వల్లనే ఈరోజు తెలంగాణను తెచ్చుకోవడం జరిగింది, అందుకుగాను అప్పటి TRS ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ఉపాధి కల్పించకుండా పోయింది, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలల్లో 250 గజాల ఇంటి స్థలము , ఝార్ఖండ్ రాష్ట్ర తరహాలో ప్రతి ఉద్యమకారుడికి 25000 రూపాయల పెన్షన్స్ సౌకర్యం, అలాగే తెలంగాణ, ఉద్యమకారులకు పదివేల కోట్ల రూపాయలతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలని, మరియు బస్సు పాసు, ట్రైన్ పాసు, సౌకర్యం కల్పించాలని, ప్రతి ఉద్యమకారుడికి హెల్త్ కార్డు ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమాభివందనలతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మర్రి శ్రీనివాస్, పుట్ట ప్రతాప్, జూపాక శ్రీనివాస్ ,మేకల రాజయ్య, మర్రి అమరేందర్, మేకల రాజకుమారి, భాగ్యమ్మ, వజ్రమ్మ ,శారద ,సమ్మక్క, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు