
జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి నిజామాబాదు లో వున్నా వారి ఇంటికి తరలించారు ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హిందువులపైన దాడులు పెరిగాయి దానిలో భాగంగా నే బాన్సువాడ పట్టణంలో హిందువుల పైన రాళ్లదాడులు జరిగితే దాడుల చేసిన వారిని వదిలేసి హిందువుల అక్రమంగా అరెస్టు చేసి హిందువులను ఇబ్బందులకు గురి చేస్తూనారు , పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందూవుల పైన రాళ్ళ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు అత్యంత కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో బాన్సువాడ నియోజకవర్గ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు పెళ్ళుబుకుతాయని ఆయన పోలీసులను హెచ్చరించారు.