
బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ గా సీమా షెట్కార్, వైస్ చైర్ పర్సన్ గా భాగ్యలక్ష్మి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు.నూతన భవనం నిర్మాణం పూర్తి అయ్యేవరకు నూతనంగా నిర్మించిన పాఠశాల భవనంలో కార్యక్రమంలో కొనసాగుతాయని చైర్మన్ తెలిపారు.ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తా…చైర్ పర్సన్ సీమా షెట్కార్…సోమవారం చైర్మన్ పదవి బాధ్యత లు చేప్పట్టిన అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధి ధేయంగా పని చేస్తానని, అందరి అభిప్రాయాలను తీసుకొంటామని ఆమె అన్నారు. ప్రతి వార్డు సమస్యలు తెలుసుకొని సమస్యలపై పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ సభ్యులు, కమిషనర్ హాయ్యుమ్ మున్సిపాలిటీ సిబ్బంది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

