
జనం న్యూస్ 26 ఫిబ్రవరి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గము, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జహీరాబాద్ తాలూకా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ అమర వీరుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన జహీరాబాద్ ముద్దుబిడ్డ సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ 16వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్. పెద్దగొల్ల నారాయణ హాజరై అమర వీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధన కోసం సామాజిక న్యాయం దిశగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. రెండు సార్లు ప్రభుత్వాలు మారినప్పటికీ అమర వీరులు సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ , మరియు న్యాలకల్ మండలం బసంత్పూర్ గ్రామానికి చెందిన ఈశాన్ రెడ్డి ల స్ఫూర్తి విగ్రహాలు ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను స్మరించుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న అమరుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కొండపురం నర్సిములు అన్నారు. హోతి (బి) గ్రామంలో సిరిసిగ లక్ష్మణ్ యాదవ్ విగ్రహం, అలాగే బసంత్పూర్ గ్రామంలో ఈశాన్ రెడ్డి ల విగ్రహం ఏర్పాటు చేసి, ప్రభుత్వం అధికారికంగా గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షులు కొండపురం నర్సింలు ,ప్రధాన కార్యదర్శి శంకర్ సాగర్, విశ్వనాథ్ యాదవ్,మదినం శివ ప్రసాద్, వడ్డే శేఖర్, బీసీ మైనారిటీ లీడర్ మొహమ్మద్ ఇమ్రాన్, చెన్న బసవ, సంగారెడ్డి , బాలకృష్ణ, దశరథ్ ప్యార్లా, రాజ్ తుముకుంట, రాజీవ్ కుమార్, విజయ్ కుమార్, గొల్ల నర్సింలు ,తదితరులు పాల్గొని అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.