
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని రైతు వేదిక లో తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుండి 28 తేదీ వరకు నిర్వహించిన వార్డు మెంబర్ సభ్యులకు శిక్షణ తరగతులు శనివారం రోజు వరకు ముగిశాయి ..చివరి రోజున వార్డు మెంబర్లకు మండల అధికారులు పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు..
ఈ కార్యక్రమంలో కొత్తగట్టు సింగారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రాచమల్ల నాగశ్రీ వార్డు మెంబర్లు పెంబర్తి భరత్, సునీత, సురేష్,ఉపసర్పంచ్ కొత్తగట్టు సాయి కృష్ణ,రఘుపతి, మానస,నాగరాజు, పాల్వాయి స్వర్ణ - వినయ్ తదితరులు పాల్గొన్నారు..