
జనం న్యూస్, 3 మార్చి, అనేగుంట గ్రామం, మొగుడంపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, మొగుడంపల్లి మండల పరిధిలోని, ఆనేగుంట గ్రామంలో, క్రైస్తవ దైవ సేవకులు సంజీవ్, మరియు సురేష్, వీరితో పాటు, మరి కొంతమంది సువార్తికులు కలిసి, అనేగుంట గ్రామంలో బహిరంగ సువార్తను ప్రకటిస్తూ, కొందరికి కరపత్రికలను పంచుతున్నప్పుడు, క్రైస్తవుల మత ప్రచారాన్ని ఓర్వలేని ఒక వ్యక్తి, సహనం కోల్పోయి, పాస్టర్ ను అడ్డగించి, పాస్టర్ సంజీవ్ ను తిట్టి, కొట్టడం జరిగింది. ఈ విషయం జహీరాబాద్ నియోజకవర్గం లోని ఆయా గ్రామాల, క్రైస్తవులకు, మరియు మత పెద్దలకు తెలియడంతో, క్రైస్తవులందరూ ఏకమై, జహీరాబాద్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, డిఎస్పి సైదా నాయక్, సిఐ శివలింగం, మరియు ఎస్ఐ కాశినాథ్ లను కలిసి, క్రైస్తవులపై దాడులు చేస్తున్న వారి పై, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, నిరసన తెలుపడంతో, పై అధికారులు స్పందించి, క్రైస్తవుల పై దాడి చేసిన వారిని, తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో పాటు, దాడి చేసిన వ్యక్తితో మాట్లాడించారు.తాను సహనం కోల్పోయి, ఆవేశంతో, తొందరపడి, పాస్టర్ సంజీవ్ ను తిట్టి, అతనిని కొట్టడం జరిగిందని, క్రైస్తవులు తనను క్షమించాలని, నిందితుడు కోరడంతో, క్రైస్తవులు నిందితుడిని క్షమించి వదిలేశారు.