
జనం న్యూస్ మార్చి 03: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూత్రశాలల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఏర్గట్లసర్పంచ్ ఉపేందర్ రెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.16 లక్షలు మంజూరు కావడంతో పాఠశాలలో మూత్రశాలల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పాఠశాలప్రధానోపాధ్యాయులు కృష్ణచారి, తోకల వంశీ, నవీన్, మన్నన్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
