
జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనకాపల్లి జీవీఎంసీ టౌన్ & బాలాజిరావు పేట ప్రైమరీ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె విష్ణుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ కె విష్ణుమూర్తి సుమారు 70మంది విద్యార్థిని విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ కె. విష్ణుమూర్తి మాట్లాడుతూ సంపూర్ణ పోషక ఆహారము తీసుకోవడం వల్ల మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన అనారోగ్యం గురి కాకుండా ఉంటారని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై రాము,బి రామలక్ష్మి, వి గౌతమీ, ఆర్ సరస్వతి, బి ఉదయ్ కుమార్ మరియు ట్రస్ట్ సిబ్బంది బి ఈశ్వర్ రావు, రామాజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.