
జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండలకేంద్రంలో గల గ్రామ కొండపైన వెలిసిన శ్రీ శేషసాయి లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిస్థాపన, మరియు సుబ్రమణ్య స్వామి విగ్రహ, వినాయక విగ్రహ, ఇతర విగ్రహాల ప్రతిస్థాపన కార్యక్రమంలో భాగంగా మండల క్లాత్ ఓనర్స్ అసోసియేషన్ సిరికొండ సభ్యులు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దేవస్థానంలో జరుగబోయే కార్యక్రమంలో పలు పంచుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ తరుపున నుండి 30,000ల రూపాయలు దేవస్థాన ప్రాంగణంలో జరుగుతున్న నవగ్రహ, ఇతర విగ్రహాల ప్రతిస్థాపన కార్యక్రమంలో బాగంగా రేకుల షేడ్ నిర్మాణనికి ఆలయ కమిటీ సభ్యులకి విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పారిపెల్లి శ్రీనివాస్, కట్టజి భానుప్రకాష్, సభ్యులు పారిపెల్లి బీనిలు, రంజిత్ సిరికొండ మండల క్లాత్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బైరి నాగేశ్వర్, ఉపాధ్యక్షులు మాద గంగాధర్, కోశాధికారి మాద లక్ష్మీనర్సయ్య, జనరల్ సెక్రెటరీ పులింటి రంజిత్ కుమార్, సభ్యులు గండ్ల అవినాష్, బైరి నరేశ్వర్, మాద ప్రసాద్, గురుడు గణేష్, ఎండి.అతిక్ ఖాన్, శ్రీరంగ సత్యనారయణ, న్యాలకంటి రాజకీషన్, ఎండి.సల్మాన్, గోష్కొండ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.