
జనం న్యూస్ 06 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
రాష్ట్ర డీజీపీ, డిఐజి, సిట్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటగా విచారణ చేయాలి, బాద్యులను శిక్షించాలి భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా: మల్దకల్ గ్రామానికి చెందిన బీసీ కులస్తుడు కుమ్మరి శేషన్న ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్ డిమాండ్ చేశారు, పోలీస్ లు దాడికి వేధింపులకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఉన్నత అధికారులు రాష్ట్ర డీజీపీ,జోగులాంబ జోన్ డి,ఐ, జీ విచారణ చేసి శేషన్న మృతికి కారకులఫై చర్యలు తీసుకోవాలని అన్నారు, శేషన్నను పోలీస్ లు దాడి చేసినట్టు అది బయటకు చెప్తే కుటుంబ సభ్యులను వేలాడదీసి కొడతామని పోలీస్ బెదిరించడం దూర్మార్గమని అన్నారు శేషన్నకు కుటుంబానికి న్యాయం చేయాలనీ అన్నారు,రాష్ట్ర డీజీపీ, డిఐజి, సిట్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటగా విచారణ చేయాలి, బాద్యులను శిక్షించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు న్యాయ పోరాటానికి భీమ్ ఆర్మీ కార్యాచరణ చేస్తుందని అన్నారు, కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు వర్షిత్, మరియు బీమ్ ఆర్మీ నాయకులు