
జనం న్యూస్ 06 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
వేడికి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అన్ని ఫ్లాట్ ఫామ్ లో దగ్గర ప్రయాణికులు రద్దీగా ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఫ్యాన్లు తిరగకుండగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పట్టించుకునే నాథుడు కరువయ్యాడు గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాకు తెలిపారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ప్రయాణికులకు కనీస అవసరాలు ఫ్యాన్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో గద్వాల ఆర్టీసీ బస్టాండ్ ఉందని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు. దయచేసి ఆర్టీసీ డిఎం స్పందించి ఫ్యాన్లు తిరిగే విధంగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు సోషల్ మీడియాకు తెలిపారు.