
జనం న్యూస్: మార్చి 6 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).
శ్రీవారిని దర్శించుకుని బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది అని పేర్కొన్నారు. నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా నేర్చుకున్నాను. వివిధ మార్గాల ద్వారా భక్తుల అభిప్రాయాలను తెలుసుకుంటా. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పిస్తాం అని టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు.