
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 7 సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణ పరిధిలో గల ఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రుల్లో రోగుల వద్ద నుండి కొన్ని ఆసుపత్రులు డబ్బులు అదనంగా వసూలు చేయడం గురించి నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ స్పందించి విచారణకు ఆదేశించారు.పల్నాడు జిల్లా వైద్య సేవ ట్రస్ట్ అధికారి జి చంద్రశేఖర్ హెచ్చరికలు చేస్తూ నోటీసులు నెట్ వర్క్ ఆసుపత్రులకు పంపించారు.ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుండి పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనే లక్ష్యం నీరుగార్చే ఆసుపత్రులు పైన కఠినంగా చర్యలు తీసుకొంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. రావు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కి చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్నామని, పత్రికల్లో సైతం కదనాలు రావడం అవమానకరం అని నోటీస్ లో వివరించారు. ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు.మార్పుకోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఫిర్యాదు చేశామని, త్వరలో వైద్య సేవ అమలులో లోపాలు ఉంటే నేరుగా బాధితుల వద్దకు వెళ్లి పిర్యాదులు స్వీకరించి ప్రభుత్వం దృష్టిలో పెడతామని తెలిపారు. ఆసుపత్రులు కూడా సహకరించి వైద్య సేవ ఆపరేషన్లు ఉచితంగా చేయాలని సూచించారు.