
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
సైన్స్ వారోత్సవాల సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తెనదీవి
సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ మరియ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (ఎస్ ఎల్ సి) ఘనంగా నిర్వహించారు. ఇందులో 100 మంది విద్యార్థులు వారి యొక్క సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఎస్ఎల్ సి లో మరో 200 మంది పాల్గొని వారు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశాలను వివరించారు. విద్యార్థుల్లో ఉన్న విజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో మేలు చేస్తాయని కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పేరెంట్ మీటింగ్లో ప్రముఖ సైకాలజిస్ట్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాయిరామ్ విద్యానికేతన్ లో పాత విధానాలకు స్వస్తి పలికి వరల్డ్ క్లాసు కరిక్యులం అయిన లీడ్ ప్రోగ్రాం లో భాగంగా అన్ని తరగతి గదులలో స్మార్ట్ టీవీ, ట్యాబ్ లతో అనుసంధానం చేయబడి నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ స్కూల్ రీజనల్ డైరెక్టర్ మోహన్, సాయి క్రాంతి, లక్ష్మణ్ లు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు పరిశీలించి వర్కింగ్ ఆఫ్ లంగ్స్, వర్కింగ్ ఆఫ్ కిడ్నీ, థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ఎనర్జీ, డైజెస్టివ్ సిస్టం, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టం తదితర ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం,బి. లక్ష్మీనారాయణ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, స్కూల్ క్యాంపస్ ఇంచార్జ్ బొమ్మిడి నాగేంద్ర వర్మ, అండలూరి శిరీష, ప్రత్యూష, గెల్లా భూలక్ష్మి దేవి, కొంకి నాగజ్యోతి, దేవరపల్లి దుర్గ, పోతుల లతా మంగేష్కర్, మద్దింశెట్టి మాలతి, బి.నాగదివ్య, కుప్పాల శ్రీ పూర్ణ దుర్గ ,డి.శ్రీ పూర్ణ ,మల్లాడి అమ్మాజీ, వీరలక్ష్మి, ఓలేటి రాణి, గుత్తాల విజయదుర్గ మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
