
మహిళలు సంకల్పిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరు --కొమరగిరి కృష్ణాచారి
జనం న్యూస్ మార్చి 09: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ మహిళలు నాటి నుండి నేటి వరకు అన్ని రంగాల్లో రాణిస్తూ విశేష ఖ్యాతిని సంపాదిస్తున్నారని తెలిపారు. మహిళలు సంకల్పిస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయురాలు శ్రీమతి సమిత, వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీమతి జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ కోమలి, వ్యవసాయ ఉత్పత్తి అంశాలను బోధించే రిషికా, హెల్త్ అండ్ బ్యూటీషియన్ బోధించే శ్రీమతి కృష్ణవేణి, అలాగే పాఠశాల అటెండర్ రజిత గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.