
జనం న్యూస్ 10-03-2026
సావిత్రి బాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సావిత్రి భాయి పూలే గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం గారు మాట్లాడుతూ ఆడబిడ్డల చదువుకోసం,వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన గొప్ప చైతన్య మూర్తి,సామాజిక ఉద్యమకారిణి సావిత్రి భాయి పూలే గారని వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ముందుకు సాగాలని అన్నారు,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు స్వామి దాస్,రాచన్న,శివ కుమార్, యస్.గోపాల్, మొహమ్మద్ ఇమ్రాన్ జి.మల్లేశం,భూమ్ రెడ్డి,యస్.వెంకట్,చెంగల్ జైపాల్,సంగన్న,యం.జైపాల్, శ్రీనివాస్,లాజర్,తదితరులు పాల్గొన్నారు
