
బిచ్కుంద మార్చ్ 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు తాసిల్దార్ ఆఫీస్ బిచ్కుంద నందు రేషన్ డీలర్స్ యొక్క సమావేశం నిర్వహించి వారికీ తెలియజేసినది ఏమనగా మండలంలోని అంత్యోదయ (AAY) రేషన్ కార్డు ఉన్నటువంటి వారికీ చక్కర కార్డు కి 1 కేజీ ఇచ్చుటకు ఆదేశాలు వచ్చినందున ఇట్టివిషయం వారికీ తెలియ జేస్తూ, రేషన్ డీలర్స్ అందరు చక్కరకు DD కట్టుటకు ఆదేశించి,సమయపాపన పాటించి సరకు పంపిణి చేయవలసిందిగా మరియు వేసవి కాలం ఉన్నందున ప్రతి షాపునందు చలివేంద్రం పెట్టగలరని, ఉదయాన్నే లేదా సాయంత్రం సరుకుల పంపిణి చేయవలసిందిగా ఆదేశించినారు.
