
జనం న్యూస్ మార్చ్ 1 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
సుందర్ మహరాజ్ను సత్కరిస్తున్న అర్చకులు, దేవస్థానం అధికారులు కాట్రేని కోన: విజయనగరం దత్త సాయి సమర్థ పీఠాధిపతి సాయి సుందర్ మహ రాజ్ బుధవారం కుండలేశ్వరం లో పార్వతీ కుండలేశ్వరం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి అధికారులు, అర్చకులు కాళ్ళకూరి కామేశ్వర శర్మ ఆలయ మర్యాద లతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం దుశ్శాలు వతో సత్కరించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించి వేద ఆశీర్వచనం చేశారు. గ్రామ పెద్దలు , దేవస్థానం ఈవో సూర్య వెంకట దుర్గా మేడం ఏర్పాట్లు పర్యవేక్షించారు
