
జనం న్యూస్ 13 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా – ఐజా పట్టణం - 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు ఐజ మున్సిపాలిటీ పరిధిలో గౌరవ మున్సిపల్ చైర్మన్ సి.ఎం. సురేష్ ఆదేశానుసారం, 9వ వార్డు కౌన్సిలర్ ఎరుకల శివ మరియు బి ఆర్ యస్ మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపుగా పెరిగిన ముళ్లకంప చెట్లు మరియు పొదలను తొలగించి శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమంలో భాగంగా వి ఇ జీ & యన్ ఓ యన్ వి ఇ జీ మార్కెట్ పక్కన ఉన్న ప్రదేశంలో పెరిగి ఉన్న ముళ్లకంప చెట్లు, పొదలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని శుభ్రంగా మార్చడం జరిగింది…ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి , పీజీకే రఘు మరియు ఇతర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతంలో పరిశుభ్రత పెంపొందడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది.
