
జనం న్యూస్, మార్చి14,అచ్యుతాపురం :
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మున్సిపాలిటీలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఎక్స్-రే యూనిట్ ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి పేదవారి కందే వైద్యం సదుపాయాలన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలో అందించాలనే సదుద్దేశంతో ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉన్నామన్నారు.యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి పరిసర ప్రాంతాల ప్రజలు మరియు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాల బారిన పడిన ప్రయాణికులు వస్తుంటారని,కనుక ఈ ఎక్స్-రే యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని,అలాగే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.
