
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా
15 రకాల నిత్యవసరాలు, చీరలతో ముస్లిం సోదరులకు రంజాన్ కానుక
నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం: ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌలా, పఠాన్ మెహర్ ఖాన్రాజంపేట నందలూరుపరిసరప్రాంతాలు :పవిత్ర రంజాన్ మాసం వేళ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం పలు గ్రామాల్లో నిరుపేద ముస్లిం కుటుంబా లకు ‘రంజాన్ తోఫా’ కానుకలను,పంపిణీచేశారు.ఆడపూరు, మర్రిపల్లి, ఉస్మాన్ నగర్, ఈడిపాలెం, మరియు మందపల్లి గ్రామాల్లోని నిరుపేదలను గుర్తించి, పండుగ పూట వారికి అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సరుకులు మరియు చీరల పంపిణీ ఈ సందర్భంగా లబ్ధిదారులకు సుమారు 15 రకాల నిత్యవసర వస్తువులతో కూడిన రంజాన్ కిట్ను అందజేశారు. పండుగకు అవసర మైన సరుకులతో పాటు, నిరుపేద మహిళలకు చీరలను కూడా పంపిణీ చేశారు. కేవలం ఒక వేదిక వద్దే కాకుండా, అర్హులైన వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారి ఇంటి వద్దకే వెళ్లి ఈ తోఫాను అందజేయడం విశేషం.ముఖ్య అతిథుల ప్రసంగం ఈ సందర్భంగా షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ మాట్లాడుతూ.. "రంజాన్ మాసం అంటేనే దానధర్మాలకు ప్రతీక. సమాజంలో వెనుకబడిన, నిరుపేద ముస్లిం సోదరుల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రధాన ఉద్దేశ్యం. నిరుపేదలు కూడా ఆనందంగా పండుగ జరుపుకో వాలనే లక్ష్యంతో ఈ సేవా కార్య క్రమాన్ని ప్రారంభించాము, అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, ప్రతి ఒక్కరూ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.సహక రించిన వారికి ధన్యవాదాలు గ్రామాల్లో ఉన్న నిరుపేదల సమా చారాన్ని సేకరించి, కార్యక్రమం విజయవంతం కావడానికి సహ కరించిన వారు:ఆడపూరు షేక్ లతీఫ్మందపల్లి హరి,రాజంపేట ముబారక్,తదితరులకు నాయకులు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వీరి సమాచారం మేరకే అర్హులైన నిరుపేదల ఇంటి వద్దకే వెళ్లి సాయం అందించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.