
-బుసిరెడ్డి పాండురంగారెడ్డి
జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ,అభిమానులకు, ఫౌండేషన్ తరపున లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికీ బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఈ పర్వదినం ప్రతి ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పండుగలు,ఆచార వ్యవహారాలు,సంస్కృతి మన జీవన విధానాన్ని సజీవంగా ఉంచుతాయన్నారు.ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని,దేవుడి దీవెనలతో అన్ని విషయాల్లో విజయం సిద్ధించాలన్నారు.మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని,ప్రజల జీవితాలు కళకళలాడాలని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆకాంక్షించారు.