
జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాయంపేట మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఈనెల 23వ తేదీన ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు విఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమంలో మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు విఎన్ఆర్ యువసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా విఎన్ఆర్ యువసేన నాయకులు కోరారు.మండలం లోని ప్రగతి సింగారం మాజీ సర్పంచ్ పోతు రమణారెడ్డి , వైనాల రాజేందర్ కొప్పుల మాజీ ఎంపీటీసీ బగ్గీ రమేష్ ,మైలారం మాజీ ఎంపీటీసీ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు మారపల్లి మోహన్, శాయంపేట ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ ,రంగు మహేందర్ శాయంపేట 12వ వార్డు సభ్యులు దైనంపల్లి సుమన్ తదితరులు పాల్గొన్నారు…